Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి

షేర్ చేయండి

తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

వేగంగా రినోవేషన్ పనులు | Tirupati Railway Station

ఈ పనులు ఎక్కడి వరకు వచ్చాయని తెలుసుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ( South Central Railways ) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ చైన్ తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మీరు కూడా తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి.

తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధుణీకరించేందుకు రూ.311 కోట్లతో పనులు మొదలు పెట్టారు.
ప్రధాన ప్రధాన పునరాభివృద్ధి పనుల పురోగతి పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ చైన్ తిరుపతి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.
తిరుపతితో పాటు ఆయన గుంతకల్, రాజంపేట, తిరుచానూరు, కడప రైల్వే స్టేషన్‌లను కూడా తనిఖీ చేశారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.311 కోట్లో రినోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా రూ.32 నిర్మించిన తిరుచానూరు స్టేషన్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు.ప్రయాణికులకు అందిస్తున్న పెసిలిటీస్ గురించి కూడా కనుక్కున్నారు.
తనిఖీలో భాగంగా వివిధ రైల్వే స్టేషన్‌లో పనులు, భద్రతా ప్రమాణాలు, రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, రైల్వే యాక్టివిటీస్, ఎలక్ట్రిక్, సిగ్నలింగ్ ఎక్విప్‌మెంట‌్‌ను చెక్ చేశారు.దీంతో పాటు రైల్వే స్టేషన్‌లోనే క్యాటరింగ్ విభాగాన్ని కూడా ఆయన పరిశీలించారు.

ఈ రినోవేషన్ పనులు పూర్తి అయితే తిరుపతి రైల్వే స్టేషన్ మరింత అందంగా, ఆహ్లాకరంగా కనిపంచనుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!