అమృత్ భారత్ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ( Sullurpet Railway Station) అప్గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.

మోడల్ రైల్వే ష్టేషన్ | Sullurpet Railway Station
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా సరికొత్తగా అభివృద్ధి చేశారు. రినోవేషన్ కోసం తొలి విడతలో రూ.11 కోట్లను విడుదల చేయగా, రెండవ విడతలో రూ.12 కోట్లను విడుదల చేశారు.
మొత్తానికి రూ.23 కోట్లతో స్టేషన్కు కొత్త లుక్ తీసుకువచ్చారు. లుక్ విషయం మాత్రమే కాకుండా స్టేషన్ల ప్రాంగణాన్ని మరింతగా విస్తరించారు.

అంతే కాకుండా హైటెక్ వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు, డిజిటల్ డిస్ప్లేలు, టికెట్ కౌంటర్లను మోడర్నైజ్ చేశారు.

రైల్వే స్టేషన్ ప్రేవేశమార్గం, ప్రాంగణాన్ని సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయ (Chengalamma Temple) నమూనాలో తీర్చి దిద్దారు.

స్థానిక ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకగా ఈ స్టేషన్ను సరికొత్త హంగుతలతో అందంగా మార్చారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.