పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theertham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించారు.
ముఖ్యాంశాలు
వాటికి సంబంధించిన చిత్రాలు ఇవే…

ఈ డ్రిల్లో ఆక్టోపస్ ఫోర్స్ పోలీసులు, టిటిడి విజిలెన్స్ టీమ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback

మాక్ డ్రిల్లో భాగంగా తిరుపతిలోని కపిల తీర్థం సమీపంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద ఆక్టోపస్ దళాలు (Octopus Force) మూడు టీమ్లుగా ఏర్పడ్డాయి.

మాక్ డ్రిల్ ఎందుకంటే
ఒక వేళ ఉగ్రవాదులు ఎవరైనా ఆలయంలోకి ప్రవేశిస్తే వారిని ఎలా నిలువరించాలి…భక్తులను ఎలా బయటికి సురక్షితంగా తీసుకురావాలో ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించారు.

ఎవరెవరు పాల్గొన్నారంటే | Kapila Theertham Temple
ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్న భద్రతా సిబ్బంది ఒక వేళ ఉగ్రదాడి జరిగితే ఏం చేయాలో టిటిటీ విజిలెన్స్ టీమ్, బాంబ్ స్క్వాడ్, రిజర్వ్ స్టాఫ్, సివిల్ పోలీసులు, మెడికల్,ఫైర్, రెవెన్యూ, ట్రాఫిక్ సిబ్బందికి వివరించారు.

కపిల తీర్థం ఆలయంలో ఈ మాక్ డ్రిల్ దాదాపు రెండు గంటల పాటు జరిగింది.

ఇందులో 40 మంది ఆక్టోపస్ కమాండోలు, 10 మంది టిటిడి విజిలెన్స్ సిబ్బందితో పాటు 12 మంది పోలీసులు, 12 ఏర్ సిబ్బంది, 12 మంది వైద్య, ఫైర్, బాంబ్ స్వ్కాడ్, ఆర్మ్డ్, వాటర్, ఎలక్ట్రికల్, గ్యాస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ మాక్ డ్రిల్లో టిటిడి విజిలెన్స్, పోలిస్, అక్టోపస్ విభాగానికి సంబంధిచిన అధికారులు కూడా పాల్గొన్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.