మహా కుంభ మేళా తేదీలను పొడగించనున్నారా? అధికారులు ఏమంటున్నారు? | Maha Kumbh Mela 2025

షేర్ చేయండి

Maha Kumbh

2025 జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజు కుంభ మేళా (Maha Kumbh Mela 2025) ముగియనుంది. అయితే ఈ సమయంలో మహా కుంభమేళాను పొడగించనున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు ముందుగా నిర్ణయించిన తేదీలకే మహాకుంభమేళా పరిమితం అవుతుంది అని స్పష్టం చేశారు.

కుంభమేళా చివరి తేదీ గురించి (Maha Kumbh Mela 2025 Last Date)

ఈ విషయంపై ఒక మీడియా సంస్థతో మాట్లాడిన జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధన్ పొడగింపుపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కొంత మంది ఇలా చేస్తున్నారన్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కుంభమేళా ముగుస్తుంది అని తెలిపారు రవీంద్ర  కుమార్.

మహా కుంభమేళా విశిష్టత | Maha Kumbh Mela 2025 Specialty

కుంభ మేళా అనేది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే ఈ సారి 144 సంవత్సరాలకు వచ్చే అరుదైనా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) వైభవంగా జరుగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు సుమారు 50 కోట్ల మంది భక్తులు ఇందులో పాల్గొని పవిత్ర స్నానాలను ఆచరించారు. 

గతంలో అధికారులు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసినా ఇంకా గడువు ముగియకుండానే ఉండగానే 50 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చారు.

త్రివేణి సంగమం | Triveni Sangam

Maha Kumbh Mela 2025
మహా కుంభ మేళా

పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదుల కలయిక జరిగే త్రివేణి సంగమానికి (Triveni Sangam) భక్తుల తాకిడీ ఎక్కువగా ఉండటంతో చాలా మంది కుంభమేళాను కొనసాగిస్తారు అని భావించారు. దీనికి తగిన విధంగానే పుకార్లు (Rumors About Maha Kumbh Mela 2025 Extensions) కూడా వ్యాపించాయి. దీంతో ప్రజల్లో తెలియని అయోమయం నెలకొంది. అందుకే అధికారులు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

మహా కుంభమేళా ముగియడానికి ఇంకా ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. ఈ మేఘాలో అఖారాకు చెందిన నాగ సాధువులు రాజస్నానాలు (Shahi Snan) చేయడం ఈ మేళాలో ప్రధాన ఆకర్షనగా నిలిచింది.

కుంభ మేళా సమయంలో పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం, మూడుసార్లు మునకేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. సకల పాపాలు తొలగి మోక్షం (Moksha) లభిస్తుంది అని భక్తుల విశ్వాసం.

పుకార్లను నమ్మకండి

ఇక కుంభ మేళా విషయంలో భక్తులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా కేవలం అధికారులు, ప్రభుత్వం అందించే సమాచారాన్ని నమ్మాల్సి ఉంటుంది. ఏదైనా అసత్య ప్రచారాన్ని నమ్మే ముందు అధికారిక సమాచారం అందించే వెబ్‌సైట్స్ లేదా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై వచ్చే సమాచారాన్నిచెక్ చ మాత్రమే నమ్మాలి. 

మహాకుంభ మేళా ముగింపు దశ అనేది ఆధ్యాత్మికంగా (Spiritual) కూడా ఎంతో ప్రధానమైనది అని చెప్పవచ్చు. ఒక వైపు మహా శివరాత్రి (Maha Shivaratri 2022), మరో వైపు కుంభమేళా ముగింపు కూడా అదే రోజున ఉండనుండటంతో భక్తులు భారీ సంఖ్యలో కాశీ (Kashi), ప్రయాగ్‌రాజ్‌కు తరలి వచ్చే అవకాశం  ఉంటుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!